Pallava Dynasty History: పల్లవుల రాజకీయ చరిత్ర, పాలకులు మరియు సాంస్కృతిక వైభవం

Pallava Dynasty History: క్రీ.శ. 4 వ శతాబ్దంలో దక్షిణాదిలో పల్లవులు బలీయమైన శక్తిగా ఉద్భవించారు. క్రీ.శ. ఏడవ శతాబ్ది నాటికీ వారి శక్తి ఉచ్ఛస్థితికి చేరింది. సుమారు 500 సంవత్సరాల పాటు తమ పాలనను పల్లవులు కొనసాగించగలిగారు. వీరికాలంలో గొప్ప నగరాలు, విద్యా కేంద్రాలు, దేవాలయాలు, శిల్పాల నిర్మాణాలు జరిగాయి. ఆగ్నేయాసియాలో ఎక్కువ భాగాన్ని పల్లవుల తమ సంస్కృతితో ప్రభావితం చేశారు.
పల్లవుల రాజకీయ చరిత్ర
పల్లవుల చరిత్రకు సంబంధించి చరిత్రకారులు ప్రతిపాదించిన అనేక సిద్ధాంతాలు ప్రాచుర్యంలో కలవు. కొంతమంది చరిత్రకారులు వారు పార్థియన్ ప్రజల శాఖ (ఇరాన్ నుండి ఒక తెగ)కు చెందిన వారని క్రమంగా దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని తెలిపారు. మరికొంతమంది పల్లవులు దక్షిణ ప్రాంతంలో ఉద్భవించిన స్థానిక రాజవంశం అని, వివిధ తెగల మిశ్రమం అని చెబుతారు.
Read Also : Vayu Baan Project India: శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే IAF ‘వాయు బాణ్’!
మద్రాసు సమీపంలోని తొండైమండలం ప్రాంతంలో మొదట స్థిరపడిన వారు నాగా మూలానికి చెందిన వారని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. మరొక సిద్ధాంతం ప్రకారం పల్లవులు మణిపల్లవం (శ్రీలంకలోని జాఫ్నాలోని ఒక ద్వీపం) చోళ యువరాజు మరియు నాగ యువరాణి సంతతి వారని చెబుతుంది. పల్లవులు శాతవాహనుల సామంతులు అని మరికొందరు అభిప్రాయపడ్డారు. క్రీస్తుశకం 4వ శతాబ్దం ప్రారంభంలో మొదటి పల్లవ రాజులు పాలించారు. క్రీస్తుశకం 7వ శతాబ్దం నాటికి, దక్షిణ భారతదేశంలో బాదామి చాళుక్యులు, మధురై పాండ్యులు, కాంచీపురం పల్లవులు అనే మూడు రాజ్యాలు ఆధిపత్యం కోసం పోటీ పడ్డాయి.
పల్లవ రాజవంశం పరిధి
పల్లవుల రాజధాని కాంచీపురం. వారి పాలనలోని భూభాగాలు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్తర భాగం నుండి దక్షిణాన కావేరీ నది వరకు విస్తరించి ఉన్నాయి. ఏడవ శతాబ్దంలో, పల్లవుల అధికారం ద్వారా చోళులు ఉపాంత స్థితికి దిగజారారు. చాళుక్యులను ఓడించిన పల్లవ రాజు నరసింహవర్మన్ వాతాపి (బాదామి)ని ఆక్రమించాడు. కలభ్ర తిరుగుబాటును పాండ్యులు, చాళుక్యులు, పల్లవులు కలిసి అణిచివేశారు. మూడు రాజవంశాలకు చెందిన బ్రాహ్మణ పాలకులు బ్రాహ్మణులకు చేసిన అనేక భూదానాలు (బ్రహ్మదేయ)పై కలభ్రలు నిరసన వ్యక్తం చేశారు.
Pallava Dynasty History: పల్లవ సామ్రాజ్య పాలకులు
శివస్కంద వర్మన్
తొలి పాలకులలో గొప్పవాడు. క్రీ.శ.4వ శతాబ్దం ప్రారంభంలో పాలించారు. ఇతడు అశ్వమేధ, ఇతర వైదిక యాగాలు చేసాడు.
సింహవర్మన్/సింహవిష్ణు
ఇతడు బౌద్ధుడు. శ్రీలంకను తన రాజ్యంలో కలుపుకున్నాడు. సమకాలీన తమిళ పాలకులను ఓడించాడు. పల్లవ చరిత్ర ఈ పాలకుడి నుండి మెరుగైన స్థానాన్ని పొందింది.
E – Books Zone : https://eoaebookzone.blogspot.com
మహేంద్రవర్మన్
తండ్రి అయిన సింహవిష్ణువుపై విజయం సాధించాడు. ఇతను స్వతహాగా కవి. విచిత్రచిత, మహావిలాస ప్రహసనలను రచించాడు. కొండను తొలిచి చేసే ఆలయ నిర్మాణాన్ని పరిచయం చేశాడు. తొలుత శైవ మతావలంబీకుడైనా తరువాత కాలంలో జైనుడుగా మారాడు. చాళుక్య రాజవంశానికి చెందిన రెండవ పులకేసిన్తో ఉన్న శత్రుత్వం కారణంగా అనేక యుద్ధాలు చేశాడు. చాళుక్యులతో జరిగిన యుద్ధంలో మహేంద్రవర్మన్ మరణించాడు. ఇతను సమర్థుడైన పాలకుడు.
నరసింహవర్మన్ -I
మహేంద్రవర్మన్ కుమారుడు మరియు వారసుడు కూడా. ఇతన్ని పల్లవులలో గొప్ప పాలకునిగా పరిగణిస్తారు. నరసింహవర్మను మహామల్ల/మామల్ల అని కూడా పిలుస్తారు. క్రీ.శ.642లో పులకేసిన్-IIని ఓడించి వధించాడు. చాళుక్యుల రాజధాని వాతాపిని స్వాధీనపరుచుకున్నాడు. ఇతనికి ‘వాతాపికొండ’ అనే బిరుదు కలదు. ఇతను చోళులు, చేరులు, పాండ్యులను కూడా ఓడించాడు. శ్రీలంకపై నావికా దండయాత్రను పంపాడు. సింహళ యువరాజు మణివర్మను తిరిగి నియమించాడు. మామల్లపురం లేదా మహాబలిపురం నగరాన్ని నిర్మించాడు. దీనికి అతని పేరు పెట్టారు. 640 ADలో హ్యూయెన్ త్సాంగ్ పల్లవ రాజ్యాన్ని సందర్శించాడు. ఆ కాలంలో రాజ్యంలో నివసిస్తున్న ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించాడు. వ్యవసాయ ఉత్పత్తులు కూడా పుష్కలంగా ఉన్నాయని తెలిపాడు. అప్పర్, తిరుజ్ఞానసంబందర్, సిరుతొండార్ వంటి గొప్ప నాయన్నార్ సాధువులు నరసింహవర్మన్- I పాలనా కాలంలో ఉండేవారు.
నరసింహవర్మన్-I(Narasimhavarman I) తరువాత అతని కుమారుడు మహేంద్రవర్మన్-II పల్లవ సామ్రాజ్యాన్ని పాలించాడు. మహేంద్రవర్మన్-II తరువాత, అతని కుమారుడు పరమేశ్వరవర్మన్ రాజు అయ్యాడు. ఇతని పాలనలో, కాంచీపురం చాళుక్యులచే ఆక్రమించబడింది. పల్లవ రాజు నృపతుంగ ఒక పాండ్య రాజును ఓడించాడు. ఇతని తరువాత మరికొంతమంది పల్లవ రాజులు పాలించారు. అపరాజితవర్మన్ పల్లవ రాజవంశం యొక్క చివరి పాలకుడు. ఇతడు చోళులతో జరిగిన యుద్ధంలో మరణించాడు.






